సంజయ్ దత్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Sanjay Dutt
Sanjay Dutt

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత సౌత్ ఇండియాలో వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. KGF సినిమాలో విలన్ రోల్ లో సంజయ్ దత్ నటించి మెప్పించాడు . ప్రస్తుతం రామ్- పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీతో పాటు.. తమిళ హీరో లోకేష్ కనగరాజ్-విజయ్ దళపతి కాంబోలో వస్తున్న లియో మూవీలో కూడా నటిస్తున్నాడు.

ఇక డబుల్ ఇస్మార్ మూవీలో నటించేందుకు సంజయ్ దత్ భారీ స్థాయిలో పారితోషకం భారీగా తీసుకున్నాడని సమాచారం.అయితే అందుకు రూ.15కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడట ఈ సినిమా కోసం దాదాపు 60 రోజులకు పైగా డేట్స్ కేటాయించాడట. సంజూ భాయ్. లైగర్ మూవీ డిజాస్టర్ అందుకున్న తరువాత పూరిజగన్నాథ్, చార్మి ఈ సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలనే కసితో ఉన్నారు.

ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయిన ఈ చిత్రాన్ని 2024 మార్చి 08న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. ఇటీవలే బేబి మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుందని టాక్ వినిపిస్తోంది.మరోవైపు హీరో రామ్ కి కూడా ఇటీవల చెప్పుకోదగిన హిట్ లేదు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా వీరికి చాలా కీలకంగా మారింది మొత్తానికి విలన్ రోల్స్ కి షిప్ట్ అయిన సంజూ భాయ్ కేజీఎఫ్ మూవీ ద్వారా వచ్చిన క్రేజ్ తో రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేశాడు. ఇస్మార్ట్ శంకర్ కి ముందు కూడా రామ్ కి సరైన హిట్ లేని సమయంలో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఏం జరుగుతుందనేది కొద్ది రోజులు వేచి చూడాలి మరీ.