Election Updates: సజ్జల పై ఈసీకి ఫిర్యాదు చేసిన అచ్చెన్నాయుడు

Election Updates: Key Announcement on Volunteers.. Better Salaries..!
Election Updates: Key Announcement on Volunteers.. Better Salaries..!

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గీత దాటుతున్నారంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉంటూ సజ్జల రాజకీయ నేతలా మాట్లాడుతున్నారంటూ ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు.

సజ్జల ఓ వైసీపీ కార్యకర్తలా విపక్షాలపై విషం చిమ్ముతున్నారని వివరించారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విపక్షాలపై ఆరోపణలు చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సజ్జలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు సీఈవోకు లేఖ రాశారు..