Election Updates: ఏపీ ఎన్నికలు.. 117 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

National Politics: Congress to release manifesto today.. Good news for them..!
National Politics: Congress to release manifesto today.. Good news for them..!

ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖరారు చేసింది. దిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ మేరకు అభ్యర్థుల జాబితాకు తుది రూపు తీసుకొచ్చి నట్లు సమాచారం. సీఈసీ భేటీకి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు. 117 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులుగా పలువురి పేర్లకు ఆ పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల అభ్యర్థులను పెండింగ్లో ఉంచినట్లు సమాచారం.

కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల, రాజమహేం ద్రవరం నుంచి గిడుగు రుద్రరాజు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. వీరితో పాటు సత్యారెడ్డి (విశాఖపట్నం), పళ్లం రాజు (కాకినాడ), జేడీ శీలం (బాపట్ల) అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు తెలిసింది. పెండింగ్లో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకి పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది.