Election Updates: నేడు కుప్పంలో రెండో రోజు పర్యటించనున్న చంద్రబాబు..

Election Updates: Chandrababu will visit Kuppam for the second day today..
Election Updates: Chandrababu will visit Kuppam for the second day today..

నేడు కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు డోర్‌ టూ డోర్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును పరిశీలించనున్న టీడీపీ అధినేత, నేడు 4 మండలాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ తరుణంలోనే టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

కాగా పుంగనూరులో వైసీపీకి షాక్ తగిలింది. చంద్రబాబు సమక్షంలో సీనియర్ వైసీపీ నేత వెంకటరమణ రాజు వైసీపీ నుంచి టిడిపిలో చేరారు. దీంతో పుంగనూరులో వైసీపీకి షాక్ తగిలింది. పుంగనూరు అభ్యర్ధి చల్లా బాబు గెలుపునకు పనిచేస్తానని వెంకటరమణ రాజు హామీ ఇచ్చారు. పుంగనూరులో పెద్దిరెడ్డి ఓటమీ కలసికట్టుగా పనిచేయాలని నేతలకు సూచించారు చంద్రబాబు.