Election Updates: రేపు కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

Election Updates: CM Jagan will visit the joint Kurnool district today
Election Updates: CM Jagan will visit the joint Kurnool district today

రేపు YSR ఈబీసీ నేస్తం నిధులు సీఎం జగన్‌ విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగానే.. రేపు కర్నూలు, నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ సీఎం జగన్ చేయనున్నారు. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లిలో YSR ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్‌.

ఆర్యవైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకే వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే… 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ఏటా రూ. 15,000 చొప్పున ఆర్ధిక సహాయం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేయనుంది. ఈ పథకం కింద మూడేళ్ల పాటు 45 వేల రూపాయల ఆర్థిక చేయూత అందించనుంది ఏపీ సర్కార్‌.