Election Updates: ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు

Election Updates: EC will not be transferred on several high officials in AP
Election Updates: EC will not be transferred on several high officials in AP

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పలువురు ఉన్న తాధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు చేసింది. ముగ్గురు ఐఏఎస్లతోపాటు, ఆరుగురు ఐపీఎస్లను బదిలీ చేసింది. వీరిలో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు.

ఐఏఎస్ అధికారుల్లో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా అధికారి గౌతమి, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీషా ఉన్నారు. బదిలీ అయినవారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.