Election Updates: ఆ ధీమాతోనే చెబుతున్నా.. లక్ష మెజార్టీతో గెలుస్తా: పవన్ కళ్యాణ్

Election Updates: Pawan Kalyan's campaign from 30.. Pithapuram for 3 days..
Election Updates: Pawan Kalyan's campaign from 30.. Pithapuram for 3 days..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను పిఠాపురంలో పోటీ చేయాలని ఎక్కువ మంది కోరడంతోనే ఇక్కడి నుండి బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్. ‘నన్ను అసెంబ్లీ పంపిస్తామని హామీ ఇచ్చారు. ఆ ధీమాతోనే చెబుతున్నా.. లక్ష మెజార్టీతో గెలుస్తా. ప్రజాస్వామ్యంలో నాలాంటి వ్యక్తి గెలిస్తే రాష్ట్రానికి మంచిది కానీ నాకు కాదు అని అన్నారు. పిఠాపురంలో తనను ఓడించేందుకు ప్రత్యర్ధులు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు.

నన్ను ఓడించడానికి ఓటుకు రూ.10వేలు, కుటుంబానికి రూ.లక్ష ఇస్తున్నారు’ అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అక్కడ YCP నుంచి పోటీ చేస్తున్న వంగా గీత జనసేనలో చేరాలని ఆయన ఆహ్వానించారు. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీ నుంచే గెలిచారని గుర్తు చేశారు. నియోజకవర్గాన్ని తన స్వస్థలం చేసుకుంటానని..అక్కడి నుంచే రాష్ట్ర దశ, దిశా మారుస్తానని తెలిపారు. ఒక ఎమ్మెల్యే తలచుకుంటే ఎలా అభివృద్ధి చేయొచ్చో చూపిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.