Election Updates: మహేశ్‌బాబు ‘బిజినెస్‌మేన్‌’ చూసి మంత్రయ్యా: మంత్రి మల్లారెడ్డి

TS Politics: Ready to enter the MP ring if the party orders: Malla Reddy
TS Politics: Ready to enter the MP ring if the party orders: Malla Reddy

టాలీవుడ్ సూపర్​ స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘బిజినెస్‌మేన్‌’ చూసి తాను రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆ సినిమా పదిసార్లు చూసి ఆ స్ఫూర్తితోనే ఎంపీ అయ్యానని తెలిపారు. సేమ్‌ మోడల్‌.. సేమ్‌ సిస్టమ్‌ అని అన్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్న నటించిన యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​కు మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు.

‘‘రణ్‌బీర్‌ కపూర్‌ గారూ మీకొక విషయం చెప్పాలనుకుంటున్నా. వచ్చే ఐదేళ్లలో మొత్తం భారతదేశం, హాలీవుడ్‌, బాలీవుడ్‌ను మా తెలుగువాళ్లు రూల్‌ చేస్తారు. తెలుగు వాళ్లు చాలా స్మార్ట్‌. మా దగ్గర రాజమౌళి, దిల్‌ రాజు, ఇప్పుడు సందీప్‌రెడ్డి ఉన్నారు. మా హైదరాబాద్‌ టాప్‌లో ఉంటుంది. ‘పుష్ప’తో రష్మిక భారతదేశం మొత్తం తెలిసిపోయింది. మా మల్లారెడ్డి సంస్థల వేదికగా ఈవెంట్‌ జరుగుతోంది. మీ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ అవుతుంది. రూ.500 కోట్లకు పైగా వసూళ్లు చేయాలని కోరుకుంటాం. ఒక ఏడాది ఆగితే మీరు హైదరాబాద్‌కు మారిపోవడం బెటర్‌. ఎందుకంటే, ముంబయి పాతబడిపోతుంది.. బెంగళూరులో ట్రాఫిక్‌ జామ్‌ ఎక్కువ.. అన్ని వసతులు కలిగిన ఏకైక నగరం హైదరాబాద్‌.’’ అని అంటూ మల్లారెడ్డి నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.