Election Updates: డబ్బులకు, ప్రలోభాలకు ఎవరూ లొంగవద్దు- కిషన్‌రెడ్డి

TG Politics: Kishan Reddy started the Yatra after completing the Sankha Rao of the elections
TG Politics: Kishan Reddy started the Yatra after completing the Sankha Rao of the elections

డబ్బులకు, ప్రలోభాలకు ఎవరూ లొంగవద్దని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కోరారు. ఇవాళ హైదరాబాద్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ…రేపు తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి అని చెప్పారు.

ఇప్పటికే 4 రాష్టాల ఎన్నికలు ముగిశాయని వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కోరారు. అందరూ రాజ్యాంగం కల్పించిన ఓటును సద్వినియోగం చేసుకోవాలి. ప్రలోభాలకు, డబ్బులకు ఎవరూ లొంగవద్దు అని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇక నిన్న తెలంగాణను ఎవరు ఇవ్వలేదని, ప్రజలే తెలంగాణను సాధించుకున్నారని కిషన్‌రెడ్డి అన్నారు.