Election Updates: కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్

Election Updates: Pawan Kalyan announced Kakinada MP candidate
Election Updates: Pawan Kalyan announced Kakinada MP candidate

టీడీపీ, బీజేపి పొత్తులో భాగంగా జనసేనకు రెండు లోక్సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాలను ప్రకటించిన విషయం తెలిసిందే. కాకినాడ ఎంపీ అభ్యర్థిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బరిలో ఉంటారని వెల్లడించారు.

తన కోసం ఉదయ్ పిఠాపురం సీటును త్యాగం చేశారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉదయ్ ఈ స్థానం నుంచి పోటీ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న నమ్మకం తనకుందని ఆయన అన్నారు. ఉదయ్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.. కాగా, పొత్తులో భాగంగా జనసేనకు కాకినాడతో పాటు మచిలీపట్నం ఎంపీ సీట్లు కేటాయించారు.