Election Updates: ఈరోజు కోటి దీపోత్సవంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోడీ

Election Updates: Prime Minister Narendra Modi will participate in the Koti Deepotsavam today
Election Updates: Prime Minister Narendra Modi will participate in the Koti Deepotsavam today

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ మూడ్రోజుల పర్యటన ఇవాళ జరిగే రోడ్ షోతో ముగియనుంది. తిరుమల నుంచి మోదీ.. తొలుత హెలికాప్టర్‌లో మహబూబాబాద్‌కు వెళ్లి.. అక్కడ ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్‌ ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

అక్కడి నుంచి ప్రధాని మోదీ తిరిగి హైదరాబాద్‌ చేరుకోని, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడలోని వీర సావర్కర్ విగ్రహం వరకు రోడ్ షో చేయనున్నారు. ప్రధాని మోదీ సాయంత్రం 5నుంచి 6 గంటల వరకు 2 కిలోమీటర్ల పొడవునా రోడ్ షో జరగనుంది. ఇక ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ కోటిదీపోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.