Election Updates: చిలుకలూరిపేట ఉమ్మడి సభకు ‘ప్రజాగళం’ పేరు ఖరారు

Election Updates: The name 'Prajagalam' has been finalized for the Chilukaluripet assembly
Election Updates: The name 'Prajagalam' has been finalized for the Chilukaluripet assembly

టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తులు పెట్టుకున్న సందర్భంగా ఈ నెల 17న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించారు. ఈ ఉమ్మడి సభకు ‘ప్రజాగళం’ పేరు ఖరారు చేశారు. ప్రజాగళం పేరుతో సభ నిర్వహించాలని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు. ఈనెల 17న చిలకలూరిపేటలో మధ్యాహ్నం ప్రజాగళం సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ఒకే వేదికపైకి మోడీ చంద్రబాబు, పవన్ రానున్నారు.

కాగా ఈ ఉమ్మడి సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేయాలని బీజేపీ నేతలు కోరారు. నరేంద్ర మోడీ పర్యటనపై ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయం తీసుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కూడిన కమిటీని నిన్న నియమించారు. ప్రధాని మోడీ ఈ నెల 17న రాష్ట్రంలో పర్యటించనున్నారు. చిలకలూరిపేట సమీపంలోని బొప్పిడిలో బీజేపీ-టీడీపీ-జనసేన సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావం భారీ సభకు హాజరు కానున్నారు.