Election Updates: తెలంగాణాలో మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన CPM

Election Updates: CPM announced two more candidates in Telangana
Election Updates: CPM announced two more candidates in Telangana

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై CPM మరో కీలక ప్రకటన చేసింది. సిపిఎం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మరో రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. హుజూర్ నగర్ లో మల్లు లక్ష్మి, నల్గొండలో ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిని బరిలో నిలిపింది. మొత్తం 17 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ, ఇటీవల తొలి జాబితా 14 మందితో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఇప్పటివరకు 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మరో నియోజకవర్గంలో అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. వాస్తవానికి 14 మంది అభ్యర్థులతో జాబితాలో చోటు కల్పిస్తూ CPM తొలి జాబితా విడుదల చేసింది. పాలేరులో తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి బరిలో ఉండనున్నారు. అంతేకాదు.. సీపీఐ పార్టీ చేయబోతున్న కొత్త గూడెం నియోజక వర్గంలో సీపీఎం పార్టీ పోటీ చేయడం లేదు. అలాగే.. బీజేపీ పార్టీని ఓడించే పార్టీకి తాము ఓట్లు వేస్తామని సీపీఎం పార్టీ వెల్లడించింది.