మంత్రి సీతక్క స్వగ్రామానికి ఎట్టకేలకు బస్సు..

TG Politics: We should ensure that there is no drinking water problem in summer: Minister Sitakka
TG Politics: We should ensure that there is no drinking water problem in summer: Minister Sitakka

మంత్రి సీతక్క స్వగ్రామమైన ములుగు జిల్లాలోని జగ్గన్న పేటకు ఎట్టకేలకు బస్సు రానుంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు బుధవారం ఆ మార్గంలో సర్వే చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి స్వగ్రామానికి రోడ్డు మార్గం ఉన్నా ఆర్టీసీ బస్సులు నడవటం లేదని ఈ నెల 12న ‘ఈనాడు’ ములుగు జిల్లా పత్రికలో ‘పల్లెకు రాదు బస్సు.. మహాలక్ష్మికి లేదు చోటు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన రోడ్డు రవాణా శాఖ అధికారులు రూట్ సర్వే చేశారు.

ఈ విషయంపై వరంగల్-2 డిపో మేనేజర్ సురేశ్ను ‘న్యూ స్టుడే’ వివరణ కోరగా ఆ మార్గంలో బస్సు సౌకర్యం కల్పించేందుకు సర్వే చేశారని.. త్వరలో బస్సు నడిపిస్తామని తెలిపారు. పత్తిపల్లి-పొట్లాపూర్ మార్గంలో బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.