ఒంగోలులో గ్యాంగ్ రేప్

rape on lover with friends

ఒంగోలులో గ్యాంగ్ రేప్.. 16 ఏళ్ల బాలికను గదిలో బంధించి…ఆరుగురు రేప్

విజయవాడలోని ఓ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న బాలిక స్నేహితుడిని కలిసేందుకు తనకు ఏమాత్రం పరిచయంలేని ఒంగోలు వెళ్లింది. అదే ఆమె చేసిన తప్పయ్యింది. ఆమెని ఐదురోజులపాటు ఆమె ఓ గదిలో బంధించిన దుండగులు ఆరు రోజులపాటు అత్యాచారం చేశారు. ఏపీలో సంచలనంగా మారిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే గుంటూరుకు చెందిన 16 ఏళ్ల బాలిక విజయవాడలో చదువుకుంటోంది. ఆమెకు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కారు డ్రైవర్‌తో పరిచయమైంది. అది కాస్తా స్నేహంగా మారడటంతో అతడిని వెతుక్కుంటూ ఒంగోలు వెళ్లింది. సోమవారం రాత్రి ఏడు గంటలకు ఆమె ఒంగోలు బస్టాండ్‌కు చేరుకుంది. తన వద్ద ఫోన్ లేకపోవడంతో అక్కడే ఉన్న వేరే వ్యక్తి ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్‌కు ఫోన్ చేసింది. కానీ ఫోన్ కలవకపోవడంతో రాత్రి పది గంటల వరకూ అక్కడే ఉండిపోయింది. ఫోన్ ఇచ్చిన వ్యక్తి, మరో వ్యక్తితో కలిసి అక్కడే ఉండి ఆమెతో మెల్లగా మాటలు కలిపి, అసలు విషయాన్ని ఆరా తీశారు. నీ ఫ్రెండ్ దగ్గరకు తీసుకెళ్తానని చెప్పి తమ వెంట తీసుకెళ్లారు. నలుగురు బీటెక్ విద్యార్థులు ఉంటున్న రూమ్‌కు ఆ బాలికను తీసుకెళ్లి నిర్బంధించారు. ఆరుగురూ కలిసి ఆ బాలికపై పడి పశువాంఛ తీర్చుకున్నారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఐదు రోజులపాటు ఏమాత్రం కనికరం లేకుండా ఆ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. శనివారం ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకున్న బాలిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి గోడు వెళ్లబోసుకుంది. బాలిక చెప్పింది ఆశ్చర్యపోయిన ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బాలికపై రేప్ చేసిన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం వెతుకులాట ప్రారంభించారు.