ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుందని…ప్లాన్ చేసి గ్యాంగ్ రేప్

Plan and gang rape because getting more marks

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. బాగా చదువుతూ క్లాసులో అందరి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న బాలికపై ఈర్ష్య పెంచుకున్న కొందరు ఆమె మీద గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. అయితే అలా చేసిన వారు అందరూ ఆమెకి బంధువులే అది కూడా బావలు కావడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఈ అకృత్యంలో విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్‌ కూడా పాలుపంచుకోవడం సభ్య సమాజానికే మాయనిమచ్చగా నిలుస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్‌ గ్రామానికి చెందిన బాలిక(16) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమెకు బంధువులైన నలుగురు బాలురు కూడా అదే పాఠశాలలో ఆమె కంటే పై తరగతులు చదువుతున్నారు. చదువులో చురుగ్గా ఉండే బాలిక క్లాసులో అందరి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునేది. ఆ బాలురకు మాత్రం చదువు వంటబట్టక పరీక్షల్లో తప్పుతున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు బాలికతో పోల్చి తరుచూ తిడుతున్నారు. తల్లిదండ్రులతో తాము తిట్లు తినడానికి ఆ బాలికే కారణమనిని ఈర్ష్య పెంచుకున్న బాలురు ఆమెపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఓ రోజు మధ్యాహ్న సమయంలో బాలికను భోజనం చేద్దామని పిలిచారు. ఆమె తినే ఆహారంలో మత్తుమందు కలిపారు. దీంతో ఆ ఆహారాన్ని తిన్న బాలిక మత్తులోకి జారుకుంది. దీంతో ఆమెను పాఠశాలలోనే ఓ గదిలోకి తీసుకెళ్లి నలుగురూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఓ టీచర్ బాలురను మందలించడం మాని బాలిక పై తాను కూడా అత్యాచారం చేశాడు. అలా బాలికపై అనేకసార్లు అత్యాచారం చేసిన నిందితులు ఆ తతంగాన్ని వీడియోలు కూడా తీశారు.ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు శనివారం సోషల్‌మీడియాలో ప్రత్యక్షం కావడంతో బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు.