చిత్తూరులో దారుణం.. మైనర్ బాలికపై ఇద్దరు బలవంతపు అఘాయిత్యం.. విఫలం

Odisha Girl Gangraped Over 28 Days

ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. కామంధులు మరోమారు రెచ్చిపోయిన ఘటన చిత్తూరులో కలకలం రేపుతోంది. బాలికపై కన్నేసిన కామపిశాచులు ఒంటరిగా ఉండడం చూసి దారుణానికి ఒడిగట్టారు. కామంతో కళ్లుమూసుకుపోయి పశువు వలె అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కామవాంఛ తీర్చుకొనేందుకు విఫల యత్నం చేశారు. బాలిక పెద్దగా కేకలు పెట్టడంతో సమీపంలోని గ్రామస్థులు ఆమెను రక్షించారు.

అయితే జిల్లాలోని బి.కొత్తకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అత్యాచార యత్నం చేశారు ఇద్దరు దుర్మార్గులు. బాలిక బహిర్భూమికి వెళ్లడాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన చల్లా వెంకటేష్, బత్తల చలపతి  ఆమెను అడ్డుకున్నారు. ఒంటరి బాలికను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచార యత్నం చేయసాగారు. కామంతో ఆమెపై పడి కోరికను తీర్చుకొనేందుకు గట్టిగా యత్నించారు. కాగా కామాంధుల దుర్మార్గపు చర్యను బాలిక తీవ్రంగా ప్రతిఘటిస్తూ పెద్దగా కేకలు పట్టింది. ఆ అరుపులు విని సమీప గ్రామస్థులు అక్కడికి చేరుకునేలోపు బాధితురాలిని అక్కడే వదిలేసి నిందితులు పరారై పోయారు. ఆ తర్వాత బాలికను సురక్షితంగా ఇంటికి చేర్చారు. నిందితులపై పాతనేరచరిత్ర ఉన్నట్లుగా  తెలుస్తోంది. వెంటనే సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.