యూపీలో నిర్భయ వంటి ఘటన.. కదులుతున్న బస్ లో

Gangsters don't leave HIV victim ... gang rape

ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహా ఘటనే చోటుచేసుకుంది. ఢిల్లీలో నిర్భయన ఘటన తర్వాత నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ… కామాంధులు మాత్రం ఏమాత్రం ఆగటం లేదు. కఠిన చర్యలు  తీసుకుంటున్నప్పటికీ వారి పైత్యాన్ని మాత్రం ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయినప్పటికి మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ తరహా ఘటన యూపీ లో జరిగింది.

ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ నుంచి నోయిడాకు 25 ఏళ్ల మహిళ బస్సులో ప్రయాణం చేస్తుంది. అదే సమయంలో అత్యాచారానికి గురైంది. కదులుతున్న బస్సులో బస్సు డ్రైవర్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ముఖ్యంగా ప్రతాప్ గడ్ లో బస్సు ఎక్కిన సమయంలో బస్సు డ్రైవర్లు ఆమెకు వెనుక సీటు కేటాయించారు. బస్సు ఎక్కే సమయంలోనే ఇద్దరు డ్రైవర్లు ఆమెపై కన్నేశారు. లక్నో, మధుర మధ్య ప్రాంతంలో బస్సులోని ఆ మహిళపై అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. నోయిడాలో దిగిన ఆ మహిళ తన భర్తకు జరిగిన విషయం చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాగా వెంటేనే పోలీసులు ఇద్దరు డ్రైవర్లలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా ఇది ఎలాంటి ప్రకంపనలను సృష్టిస్తుందో చూడాలి.