ప్రియుడితో భర్తను చంపేదంకు భార్య నయా ప్లాన్… ఆపై అరెస్ట్

love-murder-karnataka

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో దారుణం చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి హత్య చేసేందుకు ప్రయత్నించింది ఇల్లాలు. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్‌ మండలం దుర్గసముద్రం పంచాయతీ వడ్డిపల్లికి చెందిన బత్తల శివయ్యకు సుజాత అనే మహిళతో పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ఈ మధ్యనే సమీప బంధువు లక్ష్మయ్యతో సుజాత అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తుంది. దీంతో అలా ఇలా విషయం తెలుసుకున్న శివయ్య పద్ధతి మార్చుకోవాలని భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయితే తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను చంపేయాలని సుజాత ప్లాన్ వేసింది.

ఆ ప్లాన్ ఏమిటంటే.. ప్రియుడు లక్ష్మయ్యను రెచ్చగొట్టింది. మార్చి 21న అతడు శివయ్యపై ఇనుప రాడ్‌తో దాడి చేసేందుకు ప్రయత్నించగా బాధితుడు తప్పించుకున్నాడు. దీంతో మే నెల 23న శివయ్యను కొందరు వ్యక్తులు కత్తులతో విచక్షణా రహితంగా నరికారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత బాధితుడు రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా శివయ్యపై అతడి భార్య, ప్రియుడు లక్ష్మయ్య హత్యాయత్నం చేసినట్లు తేలడంతో అందరూ షాక్ కి గురయ్యారు. దీంతో పోలీసులు తాజాగా లక్ష్మయ్యతో పాటు నవీన్‌ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. శివయ్య భార్య సుజాత పరారీలో ఉందని.. ఆమెను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.