బాలికను కిడ్నాప్ చేసి.. కారులోనే రేప్ యత్నం..

ఆంధ్రప్రదేశ్ లో ఘోరం వెలుగు చూసింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి కారులోనే అత్యాచారానికి పాల్పడేందుకు యత్నించాడు దుర్మర్గుడు. అయితే ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని అకివీడులో జరిగింది. అది తెలుసుకున్న పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన బాలిక ఏడాది కాలంగా ఆకివీడు మండలంలోని ఓ గ్రామంలో తన నాయనమ్మ ఇంటి వద్ద ఉంటోంది. ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. బాలిక కనిపించక పోవడంతో నాయనమ్మ ఆకివీడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు.

అయితే ఆ బాలికను కిడ్నాప్ చేసి మహబూబ్‌నగర్ తీసుకెళ్లిన దుండగులు అక్కడ కారులోనే ఆమెపై అత్యాచారానికి యత్నించారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తర్వాత బాలిక హైదరాబాద్‌లో ఉండే తన తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించింది. దీంతో తన కూతురిని వెంటబెట్టుకుని ఆయన తాజాగా ఆకివీడు చేరుకుని పోలీసు కేసు పెట్టారు. కాగా బాలిక నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు బాలికను కిడ్నాప్ చేసిన యువకుడు, అతడికి సహకరించిన కారు డ్రైవర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలింపులు జరుపుతున్నారు.