పొదల మాటున జంట.. ప్రియుడిని కొట్టి.. ప్రియురాలిపై గ్యాంగ్ రేప్

man-raped

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో గడుపుతున్న ప్రేమజంటపై కొందరు దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రియుడిని తీవ్రంగా కొట్టి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు.  అంతటితో ఆగకుండా ఆదుండగులు ఆ దారుణమైన ఘటనను సెల్‌ఫోన్లో రికార్డ్ చేసి వారి వద్దనున్న నగలు, నగదు దోచుకున్నారు. అంతేకాకుండా ఈ విషయాన్ని బయటపెడితే ఆ వీడియోలు బయట పెడతామని బెదిరింపులకు దిగారు.

అయితే తమిళనాడులోని పుదుక్కోటై జిల్లాలోని విరాలిమలై ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన వెలుగు చూడటంతో ఒక్కసారిగా జనాలంతా ఉలిక్కి పడ్డారు. ఇంత దారుణం జరిగిందా అంటూ వాపోయారు. కాగా అక్కడే ఓ సంస్థలో యువతి, యువకుడు  ఉద్యోగం చేస్తున్నారు. వీరిద్దరిదీ ఒకే ఊరు. దీంతో ఒకే కంపెనీలో పని చేస్తుండటంతో లవ్ లో పడ్డారు. అయితే లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా ఆఫీస్ మూతపడటంతో ప్రేమజంట కలుసుకోలేకపోయారు. ఈ మధ్యనే లాక్ డౌన్ సడలింపులతో ఆపీస్ తెరుచుకోవడంతో ఇద్దరూ కలుసుకున్నారు. ఆఫీసు వర్క్‌తో పాటు ప్రేమ ఊసులు చెప్పుకుంటూ గడిపుతున్నారు.

ఇదే సమయంలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఆఫీసు ముగిసిన తర్వాత ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపేందుకు తిరుచ్చి రోడ్డులోని మణికందం ప్రాంతంలో కలుసుకున్నారు. బైక్ పార్క్ చేసి పొదల చాటుకు వెళ్లిన విషయాన్ని గమనించిన కొందరు యువకులు వారిని చుట్టుముట్టారు. వెంటనే ప్రియుడిని చెట్టుకు కట్టేసి దాడి చేసిన ఆ కామాంధులు యువతిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆ దారుణాన్ని వీడియో తీసి.. ఈ విషయం ఎవరికైనా చెబితే సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. ఆ తర్వాత వారి వద్దనున్న బంగారు ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్లు దోచుకుని పారిపోయారు. కాగా నాలుగు రోజుల తర్వాత ధైర్యం చేసి ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన హేమరాజ్,  నందకుమార్, మురుగన్ ను అరెస్ట్ చేశారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేర్చారు.