Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తన కుమారుడు, నటుడు రవితేజపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. ఫిదా హీరోయిన్ సాయిపల్లవి, రవితేజ ప్రేమలో మునిగితేలుతున్నారని కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లపై వివరణ ఇచ్చిన మంత్రి తన కుమారుడికీ, సాయిపల్లవికి మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని స్పష్టంచేశారు. వాస్తవానికి ఇలాంటి విషయాల్లో తాను స్పందించబోనని, ఇద్దరు యువతీయువకుల జీవితాలపై మచ్చ పడేలా వార్తలు వస్తున్నందునే వివరణ ఇస్తున్నానని అన్నారు. తన కుమారుడికి వివాహం అయిందన్న విషయం తెలిసి కూడా ఇలాంటి అవాస్తవాలు ఎలా ప్రచారం చేస్తారని మంత్రి ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాను కోరారు. రవితేజ ఇటీవల జయ్ దేవ్ చిత్రంతో టాలీవుడ్ లో ప్రవేశించారు.