ఆపరేషన్ గరుడ మీద నేడే శివాజీ బాంబు వేస్తున్నాడు.

Hero Sivaji to reveals Operation Garuda secrets on evening

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
“ఆపరేషన్ గరుడ “… ఈ పేరుతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కేంద్రప్రభుత్వం పెద్ద కథ నడుపుతోందని గత వారం రోజులుగా వినిపిస్తోంది. కేంద్రం మీద టీడీపీ అవిశ్వాసం తరువాత ఈ విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు కాదు కొన్ని నెలల కిందటే ఈ అంశం గురించి నటుడు, ప్రత్యేక హోదా ఉద్యమ నేత శివాజీ గొంతు విప్పారు. కేంద్రం చేయబోతున్న కుట్ర గురించి అప్పుడే ఆయన ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివరించినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాజకీయ చాణుక్యుడు అనుకునే చంద్రబాబు అంచనా వేయలేని విషయాన్ని అప్పుడే అంచనా వేసిన శివాజీ ఇప్పుడు ఇంకో బాంబు పీల్చడానికి రెడీ అవుతున్నాడు.

“ ఆపరేషన్ గరుడ “ గురించి ఈ సాయంత్రం ఓ కీలక ప్రకటన చేయబోతున్నట్టు శివాజీ ప్రకటించారు. అయితే ఈ ప్రకటన మోడీ సర్కార్ కుట్ర గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, ఇక్కడి ప్రజల, నాయకుల ప్రయోజనాలకు లోబడి ఉంటుందని శివాజీ స్పష్టం చేసారు. తాను చేసే ప్రకటన వల్ల రాష్ట్ర పార్టీలు బలహీనపడితే అది కేంద్రానికి ఉపయోగపడుతుందన్న స్పృహతో శివాజీ ముందుకు వెళుతున్నారు. శివాజీ చేసే ప్రకటన కచ్చితంగా సంచలనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రకటన బయటకు వస్తే తన ప్రాణాలకే ముప్పు అని శివాజీ ఇంతకుముందే అని ఉండడం వల్ల నేడు ఆయన చెప్పే విషయం మోడీ ప్రభుత్వానికి శరాఘాతం అవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.