తెలంగాణ రావడానికి జగనే ప్రధాన కారణం: పవన్ కళ్యాణ్

Jagan is the main reason for coming to Telangana: Pawan Kalyan
Jagan is the main reason for coming to Telangana: Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రావడానికి ముఖ్య కారణమని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌‌లోని విశాఖలో వారాహి యాత్ర చేస్తున్న నేపథ్యంలో.. జగదాంబ సెంటర్‌లో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీని ఉత్తరాంధ్ర నుంచి తరిమేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.జగన్ తెలంగాణ రావడానికి ప్రధాన కారణమని పవన్ కల్యాణ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఎక్కువగా దౌర్జన్యాలు, భూకబ్జాలు చేయడం వల్లే ఆంధ్రకు చెందిన నాయకులను అక్కడి ప్రజలు తరిమేశారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అందులో జగన్ ముఖ్యమైన వ్యక్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లాగా తెలంగాణలో క్రిమినల్ రాజకీయాలు ఉండవని చెప్పుకొచ్చారు. ఏదైనా అన్యాయం జరిగితే.. పోరాటం చేసేందుకు కలిసికట్టుగా వస్తారని తెలిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తన్ని తరిమేసే వరకు తాను నిద్రపోనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కొండలు తవ్వేస్తారని.. గత ఎన్నికల్లోనే తాను గొంతు చించుకుని మరీ చెప్పినట్టు గుర్తు చేశారు. అడ్డంగా దోచుకున్న వారిని గద్దెనెక్కించారని.. కానీ ఇష్టానుసారం పాలన సాగిస్తామంటే చొక్కాలు పట్టుకుని నిలదీస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.సీఎం జగన్‌కు డబ్బు పిచ్చి పట్టుకుందంటూ విమర్శించారు. జగన్ నాయకుడు కాదని.. అతనొక వ్యాపారి అంటూ పవన్ చెప్పుకొచ్చారు.