జగన్ సర్కార్ శుభవార్త..త్వరలోనే 68 వేల టిడ్కో ఇండ్ల పంపిణి !

Jagan Sarkar's good news..Soon 68 thousand Tidco houses will be sent!
Jagan Sarkar's good news..Soon 68 thousand Tidco houses will be sent!

ఏపీ రాష్ట్ర ప్రజలకు జగన్ సర్కార్ మరో శుభవార్త అందించింది. త్వరలోనే 68 వేల టిడ్కో ఇండ్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. లక్ష 50వేల ఇండ్లను డిసెంబర్ చివరి నాటికి అందించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. 68,000 ఇండ్లను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇండ్లు ఇచ్చే ప్రాంతాలలో ఆసుపత్రి, రోడ్లు మరియు విద్యుత్ తదితర సదుపాయాలను కల్పించి మరీ ఇస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కాగా ఇప్పటివరకు 80 వేల ఇండ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. త్వరలోనే 68,000 ఇండ్లను ఇస్తామని స్పష్టం చేశారు. ఇక అటు సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులు అంటే సెర్ఫ్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో పనిచేస్తున్న 4569 మంది హెచ్ ఆర్ ఉద్యోగులకు బేసిక్ జీతం పై ఏకంగా 23% జీతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.