దాడి చేసింది మేమే…పాక్ కి షాక్ !

Jaishe Mohammed Declares That Pulwama Attack Is By Them

పుల్వామా ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించిన మర్నాడే ఉగ్రవాద సంస్థ అధినేతలకు ఆ దేశ సైన్యం సలహా ఇచ్చిందని సమాచారం. పుల్వామా ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనంటూ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో తమకు మరిన్ని చిక్కులు తప్పవని పాకిస్థాన్ స్పష్టతకు వచ్చింది. అగ్రరాజ్యాధినేత సైతం ఈ విషయంలో భారత్‌కు తమ మద్దతు తప్పకుండా ఉంటుందని, పుల్వామా దాడిని ఓ భయంకర పరిస్థితితో పోల్చడం పాక్ వెన్నులో వణుకుపుడుతోంది. అందుకే దీంతో కొంత కాలం మౌనంగా ఉండాలంటూ తమ జైషే మహ్మద్, లష్కరే తొయిబా అధినేతలకు సూచించినట్టు తెలుస్తోంది. మసూద్ అజార్, హఫీజ్ సయీద్‌లు బహిరంగ ప్రదేశాల్లో తిరగరాదని, ఎలాంటి ప్రసంగాలు చేయరాదని పాక్ ఆర్మీ కోరిందని. అంతర్జాతీయ సమాజం నుంచి వత్తిడి అధికంగా ఉందని, లోప్రొఫైల్ మెయింటైన్ చేయాలని వారికి సలహా ఇచ్చిందని ఇండియన్ ఐబీ వర్గాలకు సమాచారం అందింది.

ఇదిలా ఉండగా, పుల్వామా ఉగ్రదాడికి తామే బాధ్యులమంటూ రెండో వీడియోను జైషే మహ్మద్ మంగళవారం విడుదల చేసింది. దీంతో పాకిస్థాన్ మరింత ఇరకాటంలో పడింది. అదే సమయంలో ఫ్రాన్స్ సైతం మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టాలని సూచించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రతీసారీ చైనా అడ్డుకుంటోంది. ఈ విషయంలో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన చైనా వైఖరిని ఐరాసలోని మిగతా దేశాలు తూర్పారబడుతున్నాయి.