జనగామ బీఆర్‌ఎస్‌ టికెట్‌ పల్లా రాజేశ్వర్‌కు ఫిక్స్‌..?

Janagama BRS ticket fixed for Palla Rajeshwar..?
Janagama BRS ticket fixed for Palla Rajeshwar..?

జనగామ బీఆర్‌ఎస్‌ టికెట్‌ పల్లా రాజేశ్వర్‌కు ఫిక్స్‌ అయినట్లు సమాచారం అందుతోంది. వచ్చే ఎన్నికల్లో జనగామ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే విషయమై బీఆర్ఎస్ అధిష్టానం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యలకు దిగింది.

బుజ్జగింపు చర్యలో భాగంగా ఎమ్మెల్యే మూర్తి రెడ్డి యాదగిరిరెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆ స్థానంలో పల్ల రాజేశ్వరరెడ్డి బరిలోకి దిగెందుకు మార్గం సుగుమమైనట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.

కాగా, జనగామ బీఆర్‌ఎస్‌ పార్టీ MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి,తాటికొండ రాజయ్య కు కీలక పదవి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ నిర్నయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి లకు సీఎం కేసీఆర్ రాజీ ఫార్ములా అవలంభిస్తున్నారని సమాచారం. జనగామ MLA టికెట్ పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ డిసైడ్‌ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం.