2019 లో జనసేనదే అధికారమా…ఆ సర్వే లో నిజమెంత?

Janasena Fan sai baba naidu survey Pawan kalyan will become chief minister

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 లో ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందన్న అంచనాల్ని తల్లకిందులు చేస్తూ ఓ సర్వే బయటికి వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 83 స్థానాల్లో ఎవరు గెలిస్తే వారిదే అధికారం. లేటెస్ట్ గా సాయిబాబా నాయుడు అనే ఓ జనసేన వీరాభిమాని ఇదే నా సర్వే అంటూ పేర్లతో సహా 83 నియోజకవర్గాల్లో జనసేన గెలుస్తుందని ప్రకటించాడు. ఇదే రిపోర్ట్ ని జనసేన కార్యాలయానికి కూడా పంపాడట. వారికి ఏదైనా డౌట్ వస్తే నన్ను సంప్రదించవచ్చని కూడా ఆఫర్ ఇచ్చేసాడు. ఇంతకీ సాయిబాబా నాయుడు తాను ఎలా సర్వే చేసాడో కూడా బయటపెట్టాడు. రాష్ట్రమంతటా ఉన్న తన మిత్రులు సాయంతో వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ అవగాహన ఉన్నవారితో, మేధావులు, విలేకరులతో మాట్లాడి వారిచ్చిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదిక రూపొందించాడు అంట. పైగా ఇదే జరగబోయేది అంటూ చాలా ధీమాగా తన పేస్ బుక్ పేజీ లో ప్రకటించాడు. సాయిబాబా నాయుడు చెప్పింది నిజం అయినా కాకున్నా జిల్లాల వారీగా ఆయన అంచనా ఏమిటో మీరు కూడా ఓ లుక్ వేయండి.

Janasena Fan sai baba naidu survey Pawan kalyan will become chief minister

 మరిన్ని వార్తలు 

జగన్ పాదయాత్రకి రెడీ…ప్లీనరీ లో ప్రకటన?

నాగ్ మీద జగన్ కన్ను?.

అబ్బో మహా ఐడియా పుట్టింది.