మహాన‌టి హృద‌యంలో నిలిచిపోతుంది

jayaprakash narayan praises about mahanati movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మ‌హాన‌టికి ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు కొన‌సాగుతున్నాయి. సాధార‌ణ ప్రేక్ష‌కులు, సినీ సెల‌బ్రిటీలే కాదు…రాజ‌కీయ‌రంగాలకు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు కూడా మ‌హాన‌టిని చూసి భావోద్వేగానికి లోన‌వుతున్నారు. సినిమా అద్భుతంగా ఉందంటూ సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాలు వ్య‌క్తంచేస్తున్నారు. తాజాగా లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ మ‌హాన‌టిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మ‌హాన‌టి సినిమా చూశాను. సావిత్రిపై ఎంతో ప్రేమ‌తో ఈ బ‌యోపిక్ తెర‌కెక్కించారు. అసామాన్య క‌ళాకారిణి. ఈ సినిమాలోని న‌టీన‌టులు, తెర‌వెనుక ప‌నిచేసిన బృందం, నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ సినిమా ఆ గొప్ప‌న‌టికి మ‌ళ్లీ జీవం పోసింది. క‌న్నీరు ఆపుకోవ‌డం చాలా క‌ష్టం. ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన కీర్తిసురేశ్, స‌మంత అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. మీ అంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. ఈ చిత్రం న‌న్ను క‌దిలించింది. చాలా కాలం వ‌ర‌కు నా హృద‌యంలో నిలిచిపోతుంది…అని ట్వీట్ చేశారు. జేపీనే కాదు..పలువురు ప్ర‌ముఖులూ ఇదే అభిప్రాయం వ్య‌క్తంచేశారు. తెలుగులో ఇక‌నుంచి బ‌యోపిక్ ల‌కు మ‌హాన‌టి ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలుస్తుంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.