‘ఏకే47’ క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్‌

Kalyan Gives Clarity About 'AK 47' Title

ఈ సంవత్సరం సంక్రాంతికి బాలకృష్ణ ‘జైసింహా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యి, బాలయ్య కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా నిలిచింది. జైసింహా నిర్మాత సి కళ్యాణ్‌ భారీగా నష్టపోయాడు. ఆ కారణంగానే సి కళ్యాణ్‌కు మరో సినిమాను చేసేందుకు బాలయ్య ఓకే చెప్పాడు. బాలయ్య ఓకే చెప్పిన వెంటనే వినాయక్‌తో సినిమాను చేసేందుకు సి కళ్యాణ్‌ ఏర్పాట్లు మొదు పెట్టాడు. వీరిద్దరి కాంబోకు సక్సెస్‌ ట్రాక్‌ ఉంది. అందుకే వీరిద్దరిని మరోసారి కలిసి సినిమా చేయడం వల్ల తప్పకుండా ఫలితం ఉంటుందనే నమ్మకంతో సి కళ్యాణ్‌ ఉన్నాడు. తాజాగా సి కళ్యాణ్‌ తన బ్యానర్‌లో ‘ఏకే47’ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించాడు.

కళ్యాణ్‌ రిజిస్ట్రర్‌ చేయించిన ఆ టైటిల్‌ ఖచ్చితంగా బాలయ్య సినిమాకే అంటూ అంతా భావించారు. వినాయక్‌ యాక్షన్‌ స్టోరీకి అదే అయితే కరెక్ట్‌ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్న సమయంలోనే ‘ఏకే 47’ టైటిల్‌ బాలకృష్ణ సినిమా కోసం కాదని కళ్యాణ్‌ క్లారిటీ ఇచ్చాడు. బాలయ్యతో సినిమాకు ఇంకా టైం ఉందని, ఆ సినిమాకు టైటిల్‌ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి బాలయ్య విషయంలో వస్తున్న వార్తలపై సి కళ్యాణ్‌ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్‌లో ఉన్న గందరగోళంకు తెరపడ్డట్లయ్యింది. బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం పూర్తి అయితే కాని కొత్త సినిమాను మొదలు పెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. బాలయ్య హీరోగా సి కళ్యాణ్‌ బ్యానర్‌లో వినాయక్‌ దర్శకత్వంలో సినిమా వచ్చే ఏడాది ఉండే అవకాశం ఉంది.