‘ఛలో’తో కణం బ్రాండ్‌ వ్యాల్యూ పెరిగింది…

Kanam Movie Brand value increase because of Naga Shourya

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నాగ శౌర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను ‘ఛలో’తో అందుకున్నాడు. భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న ‘ఛలో’ చిత్రంతో నాగశౌర్య క్రేజ్‌ అమాంతం పెరిగింది. ప్రస్తుతం నాగశౌర్యతో చిత్రాలను నిర్మించేందుకు పలువురు నిర్మాతలు మరియు దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇప్పటికే నాగశౌర్య నటించిన ‘కణం’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. సాయి పల్లవి ముఖ్య పాత్రలో నటించిన ‘కణం’ చిత్రం ఏవో కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తుంది. తమిళం మరియు తెలుగులో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించినా కూడా సినిమాపై పెద్దగా క్రేజ్‌ లేనందున కొనేందుకు ఏ ఒక్కరు ముందుకు రావడం లేదు. దాంతో సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు.

‘ఛలో’ చిత్రంతో నాగశౌర్య ఖాతాలో భారీ విజయం చేరింది. దాంతో ‘కణం’ నిర్మాతలు నాగశౌర్యను ముందు పెట్టి తమ సినిమాను పబ్లిసిటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. తమిళంలో విడుదల గురించి ఎదురు చూడకుండా హీరోయిన్‌ సాయిపల్లవి మరియు హీరో నాగశౌర్యలు వరుసగా సక్సెస్‌లు దక్కించుకున్నారు అంటూ పబ్లిసిటీ చేయాలని ఫిక్స్‌ అయ్యారు. తెలుగులో ‘కణం’ చిత్రాన్ని నిన్న మొన్నటి వరకు కొనేందుకు సిద్దపడలేదు. కాని తాజాగా ‘కణం’ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు పలువురు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తున్నారు. ‘కణం’లో నాగశౌర్య పాత్ర కాస్త తక్కువగా ఉన్నా తప్పకుండా ‘ఛలో’కు వచ్చిన ఇమేజ్‌ కారణంగా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్‌ దక్కే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కణం చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సిద్దం అవుతున్నారు.