కుమారస్వామి మంత్రులు ఫైనల్ : క్యాబినెట్ లో మాయ మంత్రి

Karnataka Cabinet Expansion Congress-JDS MLAs To Take Oaths As Ministers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి మంత్రివర్గాన్ని విస్తరించారు. గత నెల 23 వ తేదిన ముఖ్యమంత్రిగా కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం నాడు 23 మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. సోదరుడు రేవణ్ణతో పాటు కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డికె శివకుమార్ కు కూడ మంత్రి పదవి దక్కింది. కాంగ్రెస్, జెడి(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పాటైంది.అయితే మంత్రివర్గం కూర్పులో రెండు పార్టీల మధ్య ఎట్టకేలకు ఓ అంగీకారానికి వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి 14 మంత్రి పదవులు దక్కాయి. జెడి(ఎస్)కు 7 మంత్రి పదవులు దక్కాయి. బీఎస్పీ,కేజేపీ కి ఒక్కొక్క మంత్రి పదవి దక్కింది.

కాంగ్రెస్ పార్టీకి హోం, నీటిపారుదల శాఖ, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, మెడికల్, భూగర్భజలవనరుల శాఖ, సోషల్ వేల్పేర్ , ఆహారం, సివిల్ సప్లయిస్ , అసెంబ్లీ వ్యవహరాల శాఖ, రవాణ, మైనింగ్ శాఖలు కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందం కుదిరింది. జెడిఎస్ కు ఫైనాన్స్, ఎక్సైజ్,సమాచారం, ఇంటలిజెన్స్, సాధారణ పరిపాలనా శాఖలు దక్కనున్నాయి.విద్యుత్, పిడబ్ల్యుడీ, పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖ, ఉద్యానవనశాఖ, పరిశ్రమలు, మైనర్ ఇరిగేషన్ శాఖలు జెడిఎస్ కు దక్కనున్నాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండు స్థానాల్లో పోటీ చేశారు. అయితే చాముండేశ్వరీ స్థానంలో జెడి(ఎస్) అభ్యర్ధి జెటి దేవేగౌడ చేతిలో సిద్దరామయ్య ఓటమిపాలయ్యారు. సిద్దరామయ్యను ఓడించిన జెడి దేవేగౌడకు కూడ కుమారస్వామి మంత్రివర్గంలో చోటు దక్కింది.

ఇక కుమారస్వామి కేబినెట్‌లో ఓ మాయ మంత్రికి చోటు లభించనుంది. మాయ మంత్రి అంటే మాయలు చేసే మంత్రి అనుకునేరు మాయవతి పార్టీ బీఎస్పీకి చెందిన మంత్రి అన్నమాట. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్, బీఎస్పీ కలసి ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓ బీఎస్పీ ఎమ్మెల్యే గెలుపొందారు. దీంతో బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ కు క్యాబినెట్ బెర్త్ స్థానం కోసం మాయవతి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇప్పేలా మాయవతి కాంగ్రెస్, జేడీఎస్ లకు ఒప్పించగలిగారు. బీఎస్పీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా మీడియాతో మాట్లాడుతూ యూపీ బయట తమ ఎమ్మెల్యే మంత్రి కావడం పార్టీ వర్గాలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.