పవన్ ఓ అరాచక శక్తి…ఆ ఫోటోలు దేనికి చిహ్నం ?

జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కల్యాణ్ పై కత్తి మహేష్ ఎప్పటి నుండో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ మీద కక్ష కట్టడం కత్తి మీద సోషల్ మీడియా వేదికగా ఒక వార్ కూడా జరిగింది. అయితే ఓ చానెల్ పుణ్యమా అంటూ పవన్ ఫ్యాన్స్ – కత్తి మహేష్ వివాదం సమసిపోగా ఇప్పుడు మరలా శ్రీ రెడ్డి ఇష్యూ వల్ల మరలా మొదటికి వచ్చింది.  పవన్ ను దూషించిన తర్వాత శ్రీరెడ్డి, వర్మలు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా పవన్ ఈ విషయం పై రాద్దాంతం చేయడం సరికాదని చెప్పిన మహేష్ ఇప్పుడు తాజాగా పవన్ ఓ అరాచక శక్తీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
 
తాజాగా పవన్ పై మహేష్ మరో షాకింగ్ పోస్ట్ పెట్టారు. గతంలో తనపై కోడిగుడ్ల దాడి చేసిన ఇద్దరు యువకులతో పవన్ దిగిన ఫొటోలను తన ఫేస్ బుక్ ఖాతాలో మహేష్ పోస్ట్ చేశారు. తనపై దాడి చేసిన ఆ ఇద్దరు ఫ్యాన్స్ తో పవన్ ఫొటోదిగడంపై మహేష్ పవన్ ని ఓ అరాచక శక్తీ అంటూ వ్యాఖ్యానించాడు. తన మీద దాడిని ఏనాడూ ఖండించని పవన్ తన పై దాడి చేసిన అభిమానులను పిలిచి మరీ అభినందించడం దేనికి చిహ్నం అంటూ మహేష్ ప్రశ్నించారు. పవన్ అభిమానులకు – మహేష్ కు మధ్య వెర్బల్ వార్ జరగుతున్న సందర్భంలో మహేష్ పై కోడిగుడ్లతో దాడి చేసి….ఓ న్యూస్ చానెల్ స్టూడియోలో ఆ ఇద్దరు యువకులు లైవ్ డిబేట్ లో పాల్గొన్న  సంగతి తెలిసిందే. ఆ డిబేట్ లో కత్తి మహేష్ కూడా పాల్గొని ….వారిపై పెట్టిన కేసు విత్ డ్రా చేసుకొని….ఆ తర్వాత ఆ వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు. అయితే ఇప్పుడు అదే యువకులతో పవన్ ఫోటో దిగడం పై కత్తి మండిపడుతున్నాడు. త్వరలో పవన్ తన అభిమానులతో రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం సృష్టించబోతున్నారని.. అప్పుడు రాష్ట్రంలో తలెత్తే పరిస్థితులు ఇలా ఉంటాయంటూ కత్తి వ్యాఖ్యానించాడు.
కత్తి మహేష్ చేసిన ఆ పోస్టు యథాతథంగా……
 

ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు నా మీద కోడిగుడ్లతో దాడి చేసిన యువకులు. నా మీద దాడిని ఏనాడూ ఖండించని పవన్ కళ్యాణ్ దాడి చేసిన అభిమానులను పిలిచి మరీ అభినందించడం దేనికి చిహ్నం? మొన్నటికి మొన్న ఫిల్మ్ ఛాంబర్ కి అభిమానుల్ని పిలవడం వెనక దాగున్న మతలబు, అమ్మ సెంటిమెంటుని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలని సాధించడం కాదా! అభిమానుల కోసం పవన్ అక్కడికి రాలేదు. తన అక్కసు వెళ్లగక్కడానికి. మా అసోషియేషన్ ను టెర్రరైజ్ చేసి. మీడియా మీద వార్ ప్రకటించడానికి వచ్చాడు. అభిమానుల ఆవేశాన్ని తన ఆయుధం గా మలుచుకోవడానికి ప్లాన్ వేసుకునే వచ్చాడు. అక్కడ జరిగింది అదే. ఆంధ్రజ్యోతి వాహనాల మీద దాడి. దాడి చేసిన అభిమానుల్ని అరెస్టు చేస్తే, వాళ్ళని విడిపించడం మానుకుని, అది కూడా మీడియా ఆరాచకమే అని కలర్ ఇస్తున్నాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఏకం చేసి, వివిధ ప్రదేశాలలో అభిమానులను రెచ్చగొట్టే ప్రసంగాలని చేయిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ : రాజకీయాలలో ఒక అరాచక శక్తిఈ ఫొటోలో ఉన్న ఇద్దరు నా మీద కోడిగుడ్లతో దాడి చేసిన యువకులు. నా మీద దాడిని…

Publiée par Mahesh Kathi sur dimanche 22 avril 2018

అన్నపూర్ణ స్టూడియోలో 24 క్రాఫ్ట్స్ మీటింగ్ అని పిలిచి. అభిమానులు అక్కడా హంగామా చేసేలా చేసి, పవన్ మాత్రం రాకుండా, మీడియాని అభిమానుల్ని తప్పుదోవ పట్టించాడు. దీని వెనక ఒక హింసాత్మక కుట్ర పునాది దాగుందని నాకు అనిపిస్తే అది నా తప్పే అవుతుంది. కానీ ఈ ఫోటో చూసాక, అది అసాధ్యం కాని కుట్ర అనిపించి రాస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కోసం చస్తాం. చంపుతాం అనే యువత ఎంతలేదన్నా ఒక 10 నుంచీ 20 వేల మంది ఉంటారు. పవన్ కి వ్యతిరేకం అనుకుంటున్న మీడియా మీద. పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేని మనుషుల్ని అటాక్ చెయ్యడానికి.రాష్ట్ర వ్యాప్తంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలజడికి సృష్టించడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న కుట్ర ఇది. మీడియా ప్రముఖుల పేర్లు, ఫోటోలు బయటపెట్టి బెదిరించడం వెనక. నాలాంటి వాళ్ళ ఇంటి అడ్రస్సులు వాళ్ళ చెంచాల ద్వారా బయట పెట్టించడం వెనక ఇదే కుట్ర ఉంది.

త్వరలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం సృష్టింపబడుతుంది. పవన్ ను పిచ్చిగా అభిమానించే కాపు-దళిత యువకులు ఈ కుట్రలో సమిధలు అవుతారు. చంద్రబాబు ప్రభుత్వం ఇరుకున పడుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధిస్తుంది. మధ్యంతర ఎన్నికలు వస్తాయి. పవన్ కళ్యాణ్ కింగ్ అవొచ్చు. లేదా కింగ్ మేకర్ అవొచ్చు.

పవన్ ఓ అరాచక శక్తి...ఆ ఫోటోలు దేనికి చిహ్నం ? - Telugu Bullet