ఏపీ సంగతి కేసీఆర్ కు ఎందుకు..?

kcr are talks about ap politics in delhi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి కేసీఆర్ ది. కానీ ఏపీలో మాత్రం ఎవరు గెలుస్తారో ఆయన ఊహించేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఇలాగే జగన్ గెలుస్తారని ప్రకటించి కంగుతిన్న కేసీఆర్.. మళ్లీ అదే రిపీట్ చేయడం అనుమానాలకు తావిస్తోంది.

చంద్రబాబును టార్గెట్ చేసి జగన్, కేసీఆర్ ఒక్కటవుతున్నారనే వాదన ఎప్పట్నుంచో ఉంది. అందుకే కేసీఆర్ నోరు తెరిస్తే జగన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు. ఇప్పుడు ఢిల్లీలో కేసీఆర్ ప్రెస్ మీట్ చూశాక అది నిజమే అనిపిస్తోంది.
హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడితే ఓ రకంగా ఉంటుంది. కానీ ఢిల్లీ వెళ్లి మరీ టీడీపీ పరిస్థితి బాగాలేదని చెప్పడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. మోడీకి కూడా తెలియాలనే బాబుపై సర్వే చేసినట్లు కేసీఆర్ గొప్పలు చెప్పారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు:

విక్రమ్ గౌడ్ ను కాల్చారా..? కాల్చుకున్నాడా..?