ఆగస్టు 7న తిరుమల వెళ్లొద్దు

tirumala temple closed on august 7 because of chandra grahanam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

చంద్రగ్రహణం కారణంగా  శ్రీవారి ఆలయాన్ని ఆగస్టు 7న మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. చంద్రగ్రహణం 7వ తేదీ రాత్రి 10.52 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12.48 గంటలకు పూర్తి అవుతుందని వివరించింది. శ్రీవారి మందిరాన్ని 7న సాయంత్రం 4.30 నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటల వరకు మూసివేయనున్నట్లు చెప్పింది. 8న వేకువ జామున ఆలయ తలుపులు తెరచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించనున్నట్లు వివరించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల అనంతరం ఉదయం 7 గంటలకు శ్రీవారి దర్శనాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది టీటీడీ.

 మరిన్ని వార్తలు

కెసిఆర్ డైలాగు తో గాల్లో తేలుతున్న జగన్… ఫ్లాష్ బ్యాక్ ప్లీజ్.

కథ నడిపింది కోవిందా

శ్రీవారి సన్నిధిలో అధికారుల చెలగాటం