4 రైల్వే సర్వీస్ లను ప్రారంభించిన కిషన్‌ రెడ్డి..!

Kishan Reddy started 4 railway services..!
Kishan Reddy started 4 railway services..!

దక్షిణ మధ్య రైల్వే నాలుగు రైల్వే సర్వీసులను పొడిగించింది.. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా కాజీపేట్, రాయచూర్, కర్నూల్ సిటీ, బోధన్ స్టేషన్లకు రైల్వే సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. కొత్త రైళ్లకు బదులు ఉన్న వాటిని పొడిగించింది రైల్వే శాఖ.. ఇక, నాలుగు కొత్త సర్వీ సులను ఈ రోజు జెం డా ఊపి ప్రారం భిం చారు కేం ద్ర మం త్రి కిషన్ రెడ్డి.. పూణె – హైదరాబాద్ ఎక్స్‌ ప్రెస్‌ను కాజీపేట్ వరకు.. నాందేడ్ – తాండూరు ఎక్స్‌ప్రెస్‌ను రాయచూర్ వరకు పొడిగించారు అధికారులు.. ఇక, జైపూర్ – కాచిగూడ వీక్లీఎక్స్‌ ప్రెస్‌ను కర్నూల్ సిటీ వరకు పొడిగించారు. కరీంనగర్ – నిజామాబాద్ ప్యాసింజర్ రైలును బోధన్ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోగా.. నేడు జెండా ఊపి ప్రారంభించారు కిషన్‌రెడ్డి.ఇక, ఈ రోజు నుంచి ప్రయాణికులకు ఈ కొత్త రైల్వే సర్వీసులు అందుబాటులోకి
రానున్నాయి.

కొత్తగా నాలుగు రైల్వే సర్వీస్ లను ప్రారంభించడం సంతోషం గా ఉంది. తెలంగాణలో చాలా ప్రాంతాలకు రైల్వే సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నాం అన్నారు కిషన్‌రెడ్డి.. సంక్రాంతి పండుగ నాడు హైదరాబాద్‌ నుంచి విశాఖకు వందే భారత ట్రైన్ లాంచ్ చేశాము.. తిరుపతి – సికింద్రాబాద్ కు వందే భారత్ సర్వీ స్.. రీసెంట్ గా హైదరాబాద్‌ నుంచి బెం గుళూర్ కు వం దే భారత్ ప్రధాని ప్రారం భించారు.. దేశంలో ఇప్పటి వరకు 34 వందే భారత్ లు ఉంటే తెలంగాణకు 3 వందే భారత్ ట్రైన్స్ ఇచ్చాం .. ఎప్పటికప్పుడు కొత్త నెట్ వర్క్ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

తెలంగాణకు రైల్ వే బడ్జెట్ 2.58 కోట్లు ఉండే 5వేల కోట్లకు పెంచింది.. తెలంగాణలో 720 కోట్ల తో తెలంగాణలో ఆధునీకరిస్తున్నం .. చర్లపల్లి రైల్ వేటర్మినల్ పూర్తి చేసి జనవరిలో సంక్రాంతికి డేడికేట్ చేయాలనే పనులు కొనసాగిస్తున్నారు.. ఎంఎంటిఎస్ పనులు కొనసాగుతాయన్నయి.. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే యాదాద్రి వరకు రెండో దశ సర్వీస్ లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆర్ఎమ్యూ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం అవుతున్నా యి..కొత్త రైలేవ్ నెట్ వర్క్ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రైల్వే సర్వేలు చేపడుతుంది.. నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామన్నారు .