సాహో’లో అతి పెద్ద సర్‌ప్రైజ్‌

Krishnam Raju Acting To Prabs Sahoo Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రం తర్వాత చేస్తున్న సినిమా ‘సాహో’. హాలీవుడ్‌ రేంజ్‌ యాక్షన్‌ సీన్స్‌ను ఈ చిత్రంలో చూపించేందుకు దర్శకుడు సుజీత్‌ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్‌ సీన్స్‌కు ఏకంగా 100 కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా తెలుస్తోంది. వంశీ మరియు ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రభాస్‌కు ఆప్తులు అయిన వీరిద్దరు కూడా ప్రభాస్‌ కోసం ఇంత భారీ స్థాయిలో ప్రయోగంను చేస్తున్నారు. సుజీత్‌ను నమ్మి ఈ స్థాయిలో సినిమాకు బడ్జెట్‌ పెట్టడంను కొందరు తప్పుబడుతున్నారు. అయినా కూడా నిర్మాతలు ఎలాంటి బెరుకు లేకుండా సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాపై అంచనాలను పెంచేందుకు ఒక బిగ్‌ సర్‌ప్రైజ్‌ను దర్శకుడు సుజీత్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రభాస్‌ సినిమాలో రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజును చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం మూడు నుండి అయిదు నిమిషాల పాటు ఉండే ఒక పాత్రలో కృష్ణం రాజు కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ‘సాహో’ చిత్రం క్రేజ్‌ను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సాహో కోసం, ప్రభాస్‌ కోసం ఇప్పటికే కృష్ణం రాజు ఈ చిత్రంలో కనిపించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. సాహోలో కృష్ణం రాజు చేయబోతున్న పాత్ర ఏంటీ అంటూ అప్పుడే సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బాలీవుడ్‌ స్టార్స్‌ పలువురు ఈ చిత్రంలో నటిస్తున్న కారణంగా అక్కడ భారీ క్రేజ్‌ ఉండటం ఖాయం. ఇక ఇప్పుడు తెలుగులో కూడా కృష్ణం రాజు కనిపిస్తాడనే వార్త రాగానే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన తదుపరి షెడ్యూల్‌ను రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్‌లో చిత్రీకరించబోతున్నారు. బాలీవుడ్‌ బ్యూరీ శ్రద్దా కపూర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించబోతుంది.