అజిత్‌ సరసన బాలయ్యను చేర్చిన దర్శకుడు

KS Ravikumar praises on balakrishna
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘జైసింహా’ విడుదల తేదీ దగ్గర పడుతుంది. మరి కొన్ని గంటల్లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంతో చాలా కాలం తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ హీరో బాలయ్యపై ప్రశంసల జల్లు కురిపించాడు. మామూలుగా అయితే బాలయ్యకు కోపం ఎక్కువ అని, ఆయన ఎవరిపై పడితే వారిపై చేయి చేసుకుంటాడు. గతంలో పలు సార్లు ఆ విషయం వెళ్లడైయ్యింది. కాని దర్శకుడు రవికుమార్‌ మాత్రం బాలయ్యది చాలా మంచి మనస్సు అంటూ కితాబిచ్చాడు.

బాలకృష్ణ గురించి దర్శకుడు రవికుమార్‌ మాట్లాడుతూ.. షూటింగ్‌కు వెళ్లే ముందు బాలకృష్ణతో కాస్త జాగ్రత్త అంటూ చాలా మంది చెప్పారు. ఆయనకు కోపం ఎక్కువ, చిన్న విషయానికి చేయి చేసుకుంటాడు అంటూ కొందరు హెచ్చరించారు. దాంతో తాను కాస్త టెన్షన్‌కు గురి అయ్యాను. కాని ఆయనతో సినిమా ప్రారంభించినప్పటి నుండి చివరి వరకు ఆయన చాలా కూల్‌గా సినిమాలో నటించాడు. ఆయన తన సహాయకులపై అప్పుడప్పుడు కోపం వ్యక్తం చేస్తాడు. అది కూడా వారి వల్ల ఇరిటేట్‌ అయినప్పుడు. అంతే కాని సినిమా షూటింగ్‌లో మాత్రం ఎప్పుడు ఆయన కోపం తెచ్చుకోలేదు. ప్రతి విషయంను కూడా జాగ్రత్తగా విని చెప్పినట్లుగా చేసే వారు.

మొదటి నుండి చివరి వరకు ఎలాంటి ఎదురు ప్రశ్నలు వేయలేదు. స్క్రిప్ట్‌ను మార్చమని అడగలేదు. ఇప్పటి వరకు తాను ఇలాంటి వారిని అజిత్‌ మరియు బాలకృష్ణలను మాత్రమే చూశాను అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు. అజిత్‌ ఒక సారి స్క్రిప్ట్‌ ఫైనల్‌ అయిన తర్వాత మళ్లీ మళ్లీ స్క్రిప్ట్‌ చర్చ తీసుకు రాడు. దర్శకుడు చెప్పిన విధంగా చేసుకుంటూ వెళ్తాడు. అలాగే బాలకృష్ణ కూడా స్క్రిప్ట్‌ చర్చ ఎప్పుడు తీసుకు రాలేదని, దర్శకుడికి పూర్తి స్వేచ్చ ఇచ్చి చిత్రంలో నటించాడు అంటూ కితాబిచ్చాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.