సోషల్ వార్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్న లోకేష్

lokesh special arrangements for social war

ట్విట్టర్‌ వేదికగా జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.  చాలా రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న నారా లోకేష్ ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా వైసీపీతో పాటూ బీజేపీని అప్పుడప్పుడు టార్గెట్ చేస్తున్నారు. సబ్జెక్ట్‌లవారీగా సమాచారంతో ట్వీట్లు చేస్తున్నారు. ఆధారాలను కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ హయాంలో నిర్ణయాలపై విమర్శలొస్తే.. వాటికి సంబంధించిన ఆధారాలను ట్వీట్‌ల ద్వారా క్లారిటీ ఇస్తున్నారు. ఈ మధ్య గమనిస్తే తెలుగులో ఎక్కువశాతం ట్వీట్లు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారట కొందరు సహాయకుల్ని పెట్టుకున్నారట. తాజాగా వైఎస్‌ఆర్ పింఛన్ కానుకపై అబద్దాలు చెబుతున్నారంటూ ట్వీట్లు పేల్చారు. మళ్లీ కొద్దిసేపటికే వైఎస్ రైతు దినోత్సవాన్ని లోకేష్ టార్గెట్ చేశారు. వెంటనే మరో ట్వీట్ వదిలారు. గతంలో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో నాగార్జున పవర్ ప్లాంట్ వ్యవహారంలో భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులపై కాల్పులు జరిపిన ఘటన.. కాకరాపల్లి ధర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు.. అప్పటి వైఎస్ ప్రభుత్వ హయాంలో కాల్పులు జరిపిన ఘటనలకు సంబంధించిన పేపర్ కటింగ్‌లు కూడా ఉంచారు.