పవన్‌కు మద్దతుగా మౌన దీక్ష

Madhavi Latha Silent Protest against Sri Reddy for Pawan Kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్‌ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. గత కొన్ని వారాలుగా శ్రీరెడ్డి చేస్తున్న ఉద్యమంకు పలువురు మద్దతు తెలుపుతూ వచ్చారు. అయితే తాజాగా పవన్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలతో ఆమెకు అందరి మద్దతు ఉపసంహరించుకున్నారు. తాజాగా శ్రీరెడ్డి వ్యాఖ్యలపై హీరోయిన్‌ మాధవిలత మౌన దీక్షకు కూర్చుంది. పవన్‌ కళ్యాణ్‌ వంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం అంటూ మాధవిలత హెచ్చరించింది. గతంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.

శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను తీవ్ర మనో వేదనకు గురి చేశాయని, ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఎంతో మంది విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా మాధవిలత ఈ విషయమై మౌనదీక్ష చేస్తుండటంతో ఆమెకు మద్దతుగా పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ మరియు సినీ వర్గాల వారు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. పవన్‌కు శ్రీరెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ మాధవిలతతో పాటు పలువురు సినీ వర్గాల వారు డిమాండ్‌ చేస్తున్నారు. శ్రీరెడ్డి మాత్రం తనపై వస్తున్న విమర్శలను లైట్‌ తీసుకుంటుంది. పవన్‌పై తాను చేసిన విమర్శలకు, వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.