Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు మరియు తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించి మహానటిగా గుర్తింపు దక్కించుకున్న సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలు మహానటి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, సమంత, దుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్, షాలిని పాండేలు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఇటీవలే ఫస్ట్లుక్ విడుదల సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ఆ విషయాన్ని వెళ్లడి చేశారు. అయితే మార్చి 30న ‘రంగస్థలం’ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో మహానటిని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.
రామ్ చరణ్, సుకుమార్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 100 కోట్ల చిత్రం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగస్థలంతో పోటీకి దిగితే నష్టం తప్ప లాభం ఉండదనే విషయాన్ని గ్రహించిన నిర్మాత అశ్వినీదత్ సినిమా విడుదల వాయిదా వేయడం జరిగింది. మార్చి నుండి ఏప్రిల్కు వాయిదా వేయాలని భావించినప్పటికి ఏప్రిల్లో పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మే లేదా జూన్లో ‘మహానటి’ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల దెబ్బ పడకుండా, సోలోగా జాగ్రత్తగా రావాలని మహానటి భావిస్తుంది. మహానటి వాయిదా వార్త కొందరికి నిరుత్సాహంను కలిగిస్తుంది.