సావిత్రి బాల్య‌స్నేహితురాలిగా షాలినీపాండే…

Mahanati Team Reveals Shalini Pandey Character In Mahanati Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

విడుద‌ల తేదీ స‌మీపిస్తున్న కొద్దీ మ‌హాన‌టిలో ఒక్కో పాత్ర‌ను రివీల్ చేస్తోంది చిత్ర‌యూనిట్. స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర‌ల‌తో పాటు సినిమాలో ఎల్వీప్ర‌సాద్ పాత్ర పోషించిన అవ‌స‌రాల శ్రీనివాస్ , సావిత్రి కెరీర్ ను తీర్చిదిద్దిన కె.వి.రెడ్డి పాత్రను పోషించిన క్రిష్ తోపాటు మ‌రికొన్ని పాత్ర‌ల‌నున‌ ఇటీవ‌లే ప‌రిచ‌యం చేసింది. తాజాగా అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే పోషించ‌నున్న పాత్ర ఏమిటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. సావిత్రి జీవితంలో, బాల్యంలో ఎంతో ప్రాధాన్య‌మున్న ఆమె స్నేహితురాలు సుశీల‌గా షాలినీపాండే న‌టిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియో చూస్తే ఈ విష‌యం అర్ధ‌మ‌వుతోంది.
సుశీల సావిత్రి ప్రాణ‌స్నేహితురాలు. సావిత్రి బాల్యానికి సంబంధించి సుశీల ఓ తీపి జ్ఞాప‌క‌మ‌ని చెబుతారు. సావిత్రి స్టార్ హీరోయిన్ అయిన త‌ర్వాత కూడా సుశీల‌తో అంతే ఆప్యాయంగా ఉండేవార‌ని, సుశీల‌ను చూడాల‌నిపించిన‌ప్పుడు ఆమె ద‌గ్గ‌ర‌కు స్వ‌యంగా వెళ్ల‌డ‌మో, లేదంటే…ఆమెనే ర‌మ్మ‌ని పిల‌వ‌డ‌మో చేసేవార‌ని అప్ప‌టివారు చెబుతుంటారు. అంత ప్రాముఖ్యం గ‌ల పాత్రలో షాలినీ పాండే క‌నిపించ‌నుంది.
అటు మ‌హాన‌టికి సంబంధించి సోష‌ల్ మీడియా లో మ‌రో వార్త కూడా చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌హాన‌టి కోసం సావిత్రిగా న‌టించిన కీర్తి సురేశ్ రూ.కోటిన్న‌ర పారితోష‌కం తీసుకుంద‌నే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ ఒక్క సినిమాతో కీర్తి సురేశ్ టాలీవుడ్ టాప్ హీరోయిన్లు స‌మంత‌..కాజ‌ల్ స‌ర‌స‌న చేరిన‌ట్ట‌యింది. మ‌హాన‌టిని తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ చేస్తుండ‌డంతో కీర్తిసురేశ్ అంత‌మొత్తం తీసుకుంద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.