నిన్నటి వరకు సుధీర్‌బాబు, ఇప్పుడు మంజుల.. మహేష్‌ను వాడేస్తున్నారు

mahesh babu release manasuku nachindi trailer
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో వారసులు వరుసగా వస్తూనే ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చే వారికి చిరంజీవి, చరణ్‌, బన్నీ వంటి వారు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చే వారికి నాగార్జున మద్దతుగా నిలుస్తున్నాడు. ఇక సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుండి కూడా పలువురు సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారు. కృష్ణ చిన్నల్లుడు సుధీర్‌బాబు చేసే ప్రతి సినిమాను కూడా మహేష్‌ బాబు ప్రత్యేకంగా ప్రమోట్‌ చేస్తాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బావా అనే అభిమానంతో సుధీర్‌ బాబు ప్రతి సినిమాకు తన వంతు సాయం అందిస్తాడు. అయితే ఇప్పటి వరకు సుధీర్‌ బాబు కమర్షియల్‌గా సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు.

సుధీర్‌బాబు కాస్త స్లో అయ్యాడు. కమర్షియల్‌ సక్సెస్‌ కోసం ఒక మంచి సబ్జెక్ట్‌ను వెదికే పనిలో పడ్డాడు. ఇప్పుడు కృష్ణ కూతురు మంజుల ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈమె ఎప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. కాని ఈసారి దర్శకురాలిగా కొత్త అవతారంలో వచ్చింది. ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రంతో మంజుల దర్శకురాలిగా పరిచయం కాబోతుంది. సందీప్‌ కిషన్‌ హీరోగా అమైరా దస్తూర్‌ హీరోయిన్‌గా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. మంజులపై అభిమానంతో ‘మనసుకు నచ్చింది’ చిత్రం ట్రైలర్‌ను మహేష్‌బాబు విడుదల చేశాడు.

మహేష్‌బాబు విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఈనెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. మహేష్‌బాబును వాడేసి ఈ చిత్రానికి ఫుల్‌గా పబ్లిసిటీ చేయాలని మంజుల కోరుకుంటుంది. అందుకే మరోసారి ఒక వేడుకను ప్లాన్‌ చేసి మహేష్‌బాబును స్పెషల్‌ గెస్ట్‌గా ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తోంది. మంజుల దర్శకురాలిగా సక్సెస్‌ అవ్వాలని మహేష్‌బాబు కూడా కోరికతో ఉన్నాడు. మహేష్‌ బాబు ఆశీస్సులతో మంజులకు మంచి ఎంట్రీ దక్కే అవకాశం ఉంది. సుధీర్‌బాబు సినిమాలు ఎలా ఉన్నా కూడా ప్రేక్షకుల్లో ఆయనకంటూ ఒక గుర్తింపు దక్కింది. అలాగే మంజులకు కూడా మంచి గుర్తింపు దక్కడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.