అఖిలప్రియ సుబ్బారెడ్డితో రాజీకి వస్తారా..?

Minister Bhuma Akhila Priya Responds on AV Subba Reddy Issue

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Minister Bhuma Akhila Priya Responds on AV Subba Reddy Issue

నంద్యాల ఉపఎన్నిక ముందు భూమా అఖిలప్రియ తన పద్ధతి మార్చుకుని తీరాలని సొంత పార్టీ నేతలతో ఆమె కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఎంత శక్తిమంతమైన నేత అయినా ఒంటెద్దు పోకడలు మంచిది కాదని, అందర్నీ కలుపుకుపోవాలని ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు కూడా అఖిలకు క్లాస్ తీసుకున్నారు. లేటెస్ట్ గా భూమా ముఖ్య అనచరుడు ఏవీ సుబ్బారెడ్డి అసంతృప్తి అఖిలను మరింత ఇబ్బందుల్లో పడేసింది.

ఇప్పటిదాకా ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోని అఖిలప్రియ.. సుబ్బారెడ్డి విషయంలో వేగంగా స్పందించారు. అసలు సుబ్బారెడ్డి తనకు తండ్రి తర్వాత తండ్రి లాంటివారని, ఆయనకు తనను మందలించే చనువు ఉందని అఖిల చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అఖిల వ్యవహారశైలికి ఇప్పటిదాకా విన్న మాటలకు, ఆమె స్పందనకు అసలు పొంతనే లేదు. తన వారనుకుంటే భూమా లాగే అఖిల కూడా వ్యవహరిస్తారనడానికి ఇదే నిదర్శనమంటున్నారు ఆమె సన్నిహితులు.

సుబ్బారెడ్డి ఇంటికెళ్లి మరీ సమస్యలు పరిష్కరించుకోవడానికి తనకేమీ నామోషీ లేదని బాబుకు అఖిల చెప్పినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే నంద్యాలలో ఇక టీడీపీ గెలుపు గుర్రానికి చిన్న స్పీడ్ బ్రేకర్ కూడా ఉండదనే చెప్పాలి. సుబ్బారెడ్డి కూడా తనను పట్టించుకోవాలని అలిగారే కానీ.. వేరే ఉద్దేశం లేదని ఆయన క్యాంప్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో అఖిలప్రియ నంద్యాల వెళ్లి సుబ్బారెడ్డిని కలిస్తే అంతా సరైపోతుందనే యోచనలో అధిష్టానం ఉంది.

మరిన్ని వార్తలు :

నంద్యాల గెలుపే భవితకు మలుపు

నంద్యాల రాజకీయంలో చివరకు గెలుపెవరిది..?