నాగ్-నాని ల మల్టీ స్టారర్ మూవీ ముహూర్తం ఇదే…

nagarjuna and nani multi starrer movie muhurtham fixed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇప్పుడు టాలీవుడ్ లో మల్టీ స్టారర్ హవా నడుస్తుంది. అప్పట్లో ఎన్టీఆర్ , నాగేశ్వరరావు , కృష్ణ , శోభన్ బాబు, కృష్ణం రాజు లు ఎలాంటి ఈగో లు లేకుండా మల్టీ స్టారర్ మూవీస్ లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. వీళ్ళ తరం తర్వాత మల్టీ స్టారర్ మూవీస్ కి డిమాండ్ తగ్గిపోయింది. కొన్నేళ్ళు గడిచిన తర్వాత మహేష్- వెంకటేష్ లు మల్టీ స్టారర్ మూవీస్ కి మళ్ళీ తెరలేపారు. ఇప్పుడు ఆ కోవలోనే టాలీవుడ్ హీరోస్ మల్టీ స్టారర్ మూవీస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

nagarjuna-and-nani

డిఫరెంట్ కథలతో ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్తదనం అందించాలి అని అనుకునే హీరోల్లో ముందు ఉండే హీరో కింగ్ నాగార్జున… ఇప్పుడు నాగార్జున, నాని తో కలిసి మల్టీ స్టారర్ మూవీ లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ అధినేత అశ్వినీదత్‌- దిల్ రాజులు సంయుక్తంగా ఈ మల్టీస్టారర్‌ మూవీని నిర్మించనున్నారు. ‘భలే మంచిరోజు, శమంతకమణి’ వంటి హిట్‌ చిత్రాలు చేసిన శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.

nagarjuna

ఇప్పటికే శ్రీరామ్‌ ఆదిత్య స్క్రిప్ట్‌ వర్క్ రెడీ చేసుకున్నాడు. ఈ సినిమా షూటింగ్‌కు ఫిబ్రవరిలో కొబ్బరికాయ కొట్టనున్నారు… ఈ చిత్రం గురించి శ్రీరామ్‌ ఆదిత్య మాట్లాడుతూ ప్రసుత్తం నాగార్జున, నానిగార్లు బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి ఫస్ట్‌ వీక్‌లో మంచి రోజు చూసి సినిమాని సెట్స్‌కి తీసుకెళతాం అని, అశ్వినీదత్‌గారు నాకు ఎంతో హెల్ప్‌ చేస్తున్నారు. ఆయన బేనర్‌లో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని శ్రీరామ్‌ ఆదిత్య అన్నారు.