ఇంకా కోలుకోని కాంగ్రెస్

nandyala-peoples-comments-on-ysrcp-jagan-mohan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

చచ్చినపామును మళ్లీ మళ్లీ చంపితే ఏమొస్తుంది. నంద్యాలలో అదే జరిగింది. బలం లేకపోయినా ఆర్భాటంగా ప్రచారం చేసి ఎన్నికల్లో నిలిచిన కాంగ్రెస్ కు నంద్యాల జనం బుద్ధి చెప్పారు. అసలు మీకు పోటీలో నిలబడే అర్హత కూడా లేదని చీదరించుకున్నారు. కనీసం డిపాజిట్ తగ్గలేదు. ఓ దశలో నోటాకే కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లొచ్చాయి.

రాష్ట్రాన్ని విభజించడమే కాకుండా.. తాము వస్తే న్యాయం జరిగేదంటూ రఘువీరా పెడుతున్న ప్రెస్ మీట్లు జనానికి చికాకు కలిగిస్తున్నాయని ఫలితం తేలిపోయింది. నంద్యాలలో కాంగ్రెస్ సీనియర్లు రంగంలోకి దిగినా కూడా ఫలితం దక్కలేదు. పైగా విభజన దోషులందరికీ జనం చెవిలో పువ్వులు పెట్టి పంపించారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ భవిష్యత్ ఎన్నికల్లో పోటీకి దిగకుండా ఉంటే మంచిదని పొలిటికల్ పండిట్స్ సలహా ఇస్తున్నారు. ముందు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలని, ఆ తర్వాత జనం నమ్మకం చూరగొనాలని సూచిస్తున్నారు. అవేమీ చేయకుండా, పైపై షోలు చేస్తే జనం ఇలాగే స్పందిస్తున్నారని చురకలు అంటిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

ఆప్ కి పూర్వవైభవం వచ్చినట్లేనా..?

ప‌దేళ్ల జైలు శిక్ష‌… క‌న్నీరు పెట్టుకున్న డేరా బాబా

ఇది సోష‌ల్ మీడియాపై గెలుపు కూడా….