National Politics: రాజకీయాలకు గుడ్ బై.. కర్ణాటక సీఎం సంచలన ప్రకటన

National Politics: Good bye to politics.. Sensational announcement of Karnataka CM
National Politics: Good bye to politics.. Sensational announcement of Karnataka CM

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో ఉండగా సంచలన ప్రకటన చేశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్టు మంగళవారం వెల్లడించారు. వచ్చే ఎన్నికల సమయానికి వయసు, ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయాల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం తనకు 77 ఏళ్లు అని, మరో నాలుగేళ్ల తర్వాత ఎన్నికల సమయానికి ఉత్సాహంగా పనిచేయగల ఉత్సాహం ఉండకపోవచ్చన్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సిద్దరామయ్య.. ఇవే తన చివరి ఎన్నికల అని, అయితే తాను రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు. ‘వరుణ నియోజకవర్గ ప్రజలు తనను మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని అడుగుతున్నారు. కానీ తాను ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. వచ్చే ఎన్నికల నాటికి 81 ఏళ్లు వస్తాయి. అప్పటికి ఆరోగ్య సహకరించకపోవచ్చు. ఉత్సాహంగా పనిచేయలేను. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రాజకీయాల్లో కొనసాగుతానని’ వివరించారు. 2028 నాటికి నాకు 82 ఏళ్లు, రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటానని పేర్కొన్నారు. సిద్ధరామయ్య గత కర్ణాటక ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి గెలిచి తొమ్మిదోసారి రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు.