తమిళ దర్శకుడు మణిరత్నం తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన పలు చిత్రాలు తెలుగులో సంచలన విజయాలను దక్కించుకున్నాయి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా ఒకప్పుడు మణిరత్నం సినిమాలు అంటే ప్రేక్షకులు పిచెక్కి పోయేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తమిళంలో ఈయన తెరకెక్కించిన సినిమాలు ఈమద్య ఏ ఒక్కటి కూడా ఆడటం లేదు. ఇక తెలుగు మరియు హిందీలో కూడా అదే పరిస్థితి. ఈయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు అంతగా ఆకట్టుకోక పోయినా కూడా అప్పటి సినిమాల కారణంగా ఇంకా కూడా మణిరత్నం సినిమా అనగానే ప్రేక్షకులు అంచనాలు పెంచుకుంటున్నారు. తాజాగా ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నవాబ్’.
అరవింద సామి, జ్యోతిక, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్, ఐశ్వర్య, త్యాగరాజన్ వంటి ముఖ్య నటీనటులు నటించిన ‘నవాబ్’ చిత్రంపై తమిళనాట భారీ అంచనాలున్నాయి. తెలుగులో కూడా ఈ చిత్రం మంచి బిజినెస్ చేసింది. ఈ చిత్రం ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండి సినిమాపై అంచనాలను పెంచింది. ఏఆర్ రహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రం పాటలు ఇప్పటికే మంచి సక్సెస్ అయ్యాయి. మణిరత్నం మరోసారి తన మార్క్తో ఈ చిత్రంను రూపొందించాడు. తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది అనే నమ్మకం వ్యక్తం అవుతుంది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఫలితం ఎలా ఉంటుందనే విషయమై అందరిలో ఉత్కంఠ నెలకొంది. తెలుగులో ఈ చిత్రాన్ని వల్లభనేని అశోక్ విడుదల చేస్తున్నాడు.