మరో మల్టీ స్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టినా మణి రత్నం

Director Mani Ratnam Next Movie With Vijay Thalapathy

ఈ మద్య మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చిత్రం నవాబ్. తెలుగు లో ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్స్ నే రాబట్టింది. కోలీవుడ్ లో మాత్రం ఈ చిత్రం సూపర్ హిట్ట్ అనే టాక్ ను సొంతం చేసుకుంది. నవాబ్ చిత్రం అన్నదమ్ముల మద్య ఆస్తి, అదిపత్య పోరుతో ఈ చిత్రాన్ని మణిరత్నం చక్కగా తెరకెక్కించాడు. ఈ చిత్రం తరువాత మణి రత్నం మరో మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించాలి అని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రం కోసం విజయ్, విక్రమ్,తో పాటు నవాబ్ చిత్రంతో మంచి నటన కనబరిచిన శింభు కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

Mani-Ratnam--multistarrer-m

ఈ సారి కూడా తన మార్క్ శైలి కనపడే విధంగా, విభిన్న మైన కథతో రావాలి అని మణి రత్నం ప్లాన్ చేస్తున్నాడు అంట. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియ్యనున్నది. మణి, ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నాడు . ఈ చిత్రానికి ఎ.ఆర్ రెహమాన్ సంగీతంను అందించనున్నాడు. మరో వైపు మహేష్ బాబు, రామ్ చరణ్ మణి రత్నం కోసం ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు డ్రీమ్ మణిరత్నం సినిమాలో నటించాలి అని, కానీ మణి రత్నం మాత్రం కోలీవుడ్ హీరోస్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. నాచురల్ స్టార్ నాని కూడా తన డ్రీమ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో నటించాలి అని ఓ ఇంటర్వ్యూ లో ఓపెన్ గానే చెప్పాడు.

Nani