జైలవకుశ సందడి షురూ

Ntr Jai Lava Kusa Movie create record in pre Business

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈ సినిమాను దసరాకు విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అప్పుడే సినిమా సందడి ప్రారంభం అయ్యింది. జై టీజర్‌ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగి పోయాయి. ఆ టీజర్‌లో విలన్‌గా ఎన్టీఆర్‌ నట విశ్వరూపంను ప్రేక్షకులు చూడటం జరిగింది. ఆ తర్వాత లవకుమార్‌ టీజర్‌లో ఒక సింపుల్‌ ఎన్టీఆర్‌ను చూపించారు. ఇక కుశ పాత్రను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాపై అంచనాలను మరింతగా పెంచారు.

మూడు విభిన్న పాత్రల్లో అనగానే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని ఎన్టీఆర్‌ మూడు పాత్రలను చూస్తుంటే అనిపిస్తుంది. మొత్తానికి సినిమా ఎన్టీఆర్‌ కెరీర్‌లో నిలిచి పోయే సినిమా అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. 50 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్నాడు. విడుదలకు ముందే ఈ సినిమా 120 కోట్లను దక్కించుకుంది. అంటే ఇప్పటికే 70 కోట్ల లాభం వచ్చింది. ఇక ముందు ముందే మరింతగా లాభాలు దక్కడం ఖాయం అని సినీ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా ఈ చిత్రంలో రాశిఖన్నా మరియు నివేదా థామస్‌లు హీరోయిన్స్‌గా నటించారు.

మరిన్ని వార్తలు:

క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న త‌మ‌న్నా

పవన్‌పై కామెంట్స్‌ చేసిన మహేష్‌… మెగా ఫ్యాన్స్‌ సీరియస్‌ 

కూతురు కోసం మంచి నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో…